రాజమౌళి పై ప్రపంచమంతా నమ్మకం పెట్టేసుకున్నారుగా…!

  • May 4, 2020 / 04:02 PM IST

‘బాహుబలి'(సిరీస్) తో ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోయాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడం తో ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. అజయ్ దేవగన్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు…ఒలీవియా మోరిస్ వంటి హాలీవుడ్ బ్యూటీ కూడా నటిస్తున్నారు.

నిజానికి ఈ ఏడాది జూలై 31 నే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ… షూటింగ్ పెండింగ్ లో ఉండడంతో కుదర్లేదు. ఇదిలా ఉంటే… ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా … 80 ల నాటి రామాయణం ను తిరిగి పునః ప్రసారం చేస్తున్నారు. దీనికి ఏకంగా 77 మిలియన్ ల వ్యూస్ రావడం విశేషం. ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ వంటి వెబ్ సిరీస్ కు కూడా రాని వ్యూస్ రావడం ఓ రికార్డు అనే చెప్పాలి. దీంతో ‘రామాయణం’ ను మళ్ళీ తెర పై చూడాలి అని చాలా మంది కోరుతున్నారు.

ఇప్పటి జనరేషన్ అలాగే ఫ్యూచర్ జనరేషన్ లకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాలి అని వారూ కోరుతున్నారు. అందుకు గాను వారు సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి. ఇతనైతేనే రామాయణం కు కరెక్ట్ అని వారు ఫిక్సయినట్టు తెలుస్తుంది. ‘#RajamouliMakeRamayan’ అనే హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus