Nagarjuna: టికెట్ రేట్ల ఇష్యు పై మండిపడ్డ నిర్మాత ఆదిశేషగిరి రావు..!

  • January 6, 2022 / 07:14 PM IST

‘బంగార్రాజు’ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ నిన్న అంటే.. బుధవారం నాడు నాగార్జున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున చెప్పిన సమాధానాలు పెద్ద దుమారాన్నే రేపయని చెప్పొచ్చు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ఏపీ టికెట్ రేట్ ఇష్యూ గురించి నాగ్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో నాగార్జున .. ‘సినిమా స్టేజ్ పై ఉన్నప్పుడు పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను’ అంటూ జవాబిచ్చారు.

ఈ క్రమంలో గతంలో ఓ సినిమా ఈవెంట్ లో నాగార్జున.. సినీ పరిశ్రమ ఫేస్ చేస్తున్న ఇష్యుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ వీడియోని షేర్ చేసి నాగార్జునని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు గల్లా అశోక్ ‘హీరో’ సినిమా ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, కృష్ణ గారి తమ్ముడు, మహేష్ బాబు చిన్నాన్న అయిన ఆదిశేషగిరి రావు గారికి కూడా టికెట్ రేట్ల ఇష్యు గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

వీటికి ఆయన సమాధానమిస్తూ.. “ఇది సినిమా వేదిక. ఇక్కడ రాజకీయాలు వద్దు. ఆ ఇష్యు గురించి అయితే నేను ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. టికెట్ రేట్ల ఇష్యు అనేది చాలా పెద్ద విషయం. మీ మీడియా వారికి కూడా దాని గురించి పూర్తి అవగాహన లేదు. అసలు ఆ ఇష్యు తలెత్తడానికి కారణం ఏంటి?ఎక్కడ మొదలైంది అనే విషయాలు మీకు తెలీదు. ప్రతీ సినిమా వేడుకలోనూ ఏదో అడగాలని అడుగుతున్నారు అంతే..!”అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆదిశేషగిరి రావు చేసిన కామెంట్స్ పరోక్షంగా నాగార్జునకి మద్దతు పలికినట్టు ఉన్నాయంటూ నెటిజన్లు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus