Meena: కొత్త సినిమా కోసం 25 ఏళ్ల తర్వాత…

  • June 17, 2021 / 10:07 PM IST

తమిళంలో ‘దృశ్యం 2’ మొదలవుతుంది అనగానే… ఎక్కువమందికి వచ్చిన డౌట్‌ ‘గౌతమి లేదు కదా… ఇప్పుడెలా?’. ‘పాపనాశం’ పేరుతో ‘దృశ్యం’ సినిమాను తమిళంలో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో కమల్‌ హాసన్‌ హీరో కాగా, ఆయన అప్పటి సన్నిహితురాలు గౌతమి కథానాయిక. ఆ జంటకు ఆ సినిమాలో మంచి పేరే వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల వాళ్లిద్దరూ నిజ జీవితంలో విడిపోయారు. ఇన్నాళ్లూ ఇది వారి సొంత విషయంగానే ఉంది. అయితే ఇప్పుడు ‘దృశ్యం 2’ను తమిళంలో ‘పాపనాశం 2’గా తీస్తారని వార్తలొస్తున్నాయి. దీంతో ఇందులో నాయిక ఎవరు అనేది ప్రశ్న. దీనికి సమాధానం… మీనా అంటున్నారు.

మలయాళ ‘దృశ్యం’ రెండు పార్టులు, తెలుగు ‘దృశ్యం’ రెండు పార్టుల్లో మీనానే కథానాయిక. భాష మారినా, హీరోలు మారినా హీరోయిన్‌ మాత్రం మారలేదు. రెండు చోట్లా ఆమె హీరోల పక్కన బాగా నప్పింది. దీంతో ఇప్పుడు తమిళ ‘దృశ్యం’లోనూ ఆమెనే తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. దీనికి కమల్‌ కూడా పచ్చ జెండా ఊపేశారని సమాచారం. దీంతో ‘పాపనాశం 2’లో కమల్‌ సరసన మీనా నటించబోతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ ఇద్దరూ 25 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారన్నమాట. ఆఖరిగా ఈ ఇద్దరూ కలసి నటించిన ‘భామనే సత్యభామనే’ కోసం.

కమల్ – మీనా గతంలో కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ‘భామనే సత్యభామనే’ తర్వాత ఇద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ‘పాపనాశం 2’తో ఆ అవకాశం అభిమానులకు కలుగుతోంది. తమిళంలో మీనాకు మంచి ఫాలోయింగే ఉండేది. చాలా హిట్‌ సినిమాల్లో నటించింది. అయితే సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయలేదు. ఇప్పుడు కమల్‌ సినిమాలో ఆ కోరిక కూడా తీరబోతోంది. మరోవైపు రజనీకాంత్‌ ‘అన్నాతే’లోనూ మీనా నటిస్తోందని సమాచారం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus