‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

  • September 23, 2019 / 07:17 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీతా ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటిక 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ‘టబు’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే… . ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఓ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. దీంతో ఆ విషయం పై క్లారిటీ వచ్చేసింది. ఇక టీజర్ ను కూడా దసరా…లేదా దీపావళికి విడుదల చేస్తారని తెలుస్తుంది. కాకపోతే ఈ విషయం పై వారూ క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus