Viswam: ‘విశ్వం’ టీం రాంగ్ ప్లానింగ్.. ముందే రిలీజ్ చేస్తే బాగా ప్లస్ అయ్యేది..!

  • October 10, 2024 / 11:05 PM IST

గోపీచంద్ (Gopichand)  హీరోగా శ్రీను (Srinu Vaitla) వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam)  అనే సినిమా రూపొందింది. అక్టోబర్ 11న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)  ఈ చిత్రాన్ని ఖర్చుకి వెనకాడకుండా నిర్మించారు. కావ్య థాపర్ (Kavya Thapar)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి.చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీత దర్శకుడు. కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ సినిమాకి అయినా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చేతన్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంటాడు.

Viswam

కానీ ఎందుకో ‘విశ్వం’కి (Viswam) ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ కూడా పడలేదు. దీంతో హుటాహుటిన ‘గుంగురు గుంగురు’ అనే పాటని భీమ్స్ తో కొట్టించారు. కొద్దిసేపటి క్రితం ఈ పాటని యూట్యూబ్లో విడుదల చేసింది చిత్ర బృందం. వినడానికి ఈ పాట బాగుంది. వెంటనే ఎక్కేసే విధంగానే ఉంది. సురేష్ గంగుల ఈ పాటకు లిరిక్స్ అందించారు. భీమ్స్, రోహిణి కలిసి ఈ పాటని ఎంతో హుషారెత్తించే విధంగా పాడారు. గోపీచంద్, కావ్య థాపర్..ల డాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.

అయితే ఇలాంటి మంచి పాటని రిలీజ్ కి ఒక్క రోజు ముందు విడుదల చేయడం వల్ల కలిసొచ్చేది ఏముంటుంది? ఇంత మంచి పాటను కనీసం వారం, పది రోజుల ముందు విడుదల చేసుంటే.. సినిమా హైప్ కి ఉపయోగపడుండేది. ఇది కచ్చితంగా ‘విశ్వం’ యూనిట్ రాంగ్ ప్లానింగ్ అనే చెప్పాలి. మీరైతే ఈ పాటని ఒకసారి చూస్తూ వినండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus