సాయి పల్లవిని కలిసినందుకు ఆనందంలో హరీష్ శంకర్

  • May 3, 2017 / 10:30 AM IST

గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ ఎంతోమంది అభిమాన దర్శకుడయ్యారు. అతని దర్శకత్వంలో నటించాలని హీరోయిన్స్ ఆసక్తికనబరుస్తున్నారు. అతనితో కలిసి మాట్లాడానికి టాలీవుడ్ తారలు ఆశపడుతున్నారు. అటువంటిది హరీష్ శంకర్ మాత్రం సాయి పల్లవితో కలిసి ఫోటో తీసుకోవాలని సాధారణ అభిమానిగా కోరుకున్నారు. మలయాళంలో ‘ప్రేమమ్‌’ సినిమా చూసినప్పటి నుంచి స్టార్ డైరక్టర్ కేరళ బ్యూటీకి ఫ్యాన్ అయిపోయారు. అందులో సాయి పల్లవి ‘మలార్‌’ పాత్రలో అందరినీ మెప్పించింది. ఆమె  వరుణ్ తేజ్ సరసన ఫిదా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఆమెను ఎప్పటి నుంచో కలవాలనుకుంటుంన్న హరీష్ శంకర్ నిన్న కలిశారు.

కలిసిన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. ‘ఫైనల్లీ మెట్‌ హెర్‌..’, ‘ఎ స్పెల్‌ బౌండ్‌ మూమెంట్‌..’ అంటూ ‘సాయి పల్లవి తో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. అంతే కాదు, కలిసేందుకు సమయమిచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్‌ కూడా చెప్పేశాడు.  ప్రస్తుతం హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నారు. ఇందులో తాను  అభిమానించే సాయి పల్లవిని నటింప చేయించాడేమోనని కొత్త అనుమానాన్ని టాలీవుడ్ ప్రజలకు రేకెత్తించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus