‘సాయంత్రం అల్లాడించేద్దాం’.. హీరో ట్వీట్ వైరల్!

  • December 15, 2020 / 04:21 PM IST

ఈ రోజు టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె పుట్టినరోజు కానుకగా ‘చావు కబురు చల్లగా’ చిత్రబృందం స్పెషల్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన లావణ్య ‘మల్లిక’ అనే పాత్రలో నటిస్తోంది. అయితే ‘చావు కబురు చల్లగా’ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన హీరో కార్తికేయ..

లావణ్యకి స్పెషల్ విషెస్ చెప్పాడు. ”మల్లీ.. ఈరోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా.. చెప్పనేలేదు.. నువ్ అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్ ని అట్టుకొస్తా.. అల్లాడించేద్దాం అంతే” అంటూ కామెంట్ చేశాడు. సాయంత్రం పార్టీ చేసుకొని చిల్ అవుదామని అన్నట్లుగా కార్తికేయ చెప్పిన ఈ తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా విషయానికొస్తే ..

యంగ్ డైరెక్టర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో కార్తికేయ మాస్ లుక్ లో కనిపించాడు. ఆమని, భద్రం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus