ఖరారైన మహేష్, వంశీ సినిమాలో హీరోయిన్

  • January 3, 2018 / 06:30 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ మూవీతో పాటు మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమా కోసం కూడా పనులు దాదాపు పూర్తి అయ్యాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత డైరక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం కోసం డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కూడా కంప్లీట్ చేసారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి అవసరమైన అన్ని పనులను చిత్ర బృదం పూర్తి చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. తాజాగా ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. ముకుంద సినిమాలో అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, డీజే లో అందంతో మతి పోగొట్టింది. ప్రస్తుతం శ్రీ వాసు దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తోంది. ఇప్పుడు మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus