వెంకటేష్, తేజ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ ?

  • December 11, 2017 / 01:19 PM IST

విక్టరీ వెంకటేష్.. కత్రినా కైఫ్, ట్వింకిల్ ఖన్నా వంటి ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. అలాగే ఎక్కువమంది బాలీవుడ్ బ్యూటీలు వెంకీ సరసన కలిసి నటించారు. ఆ జాబితాలో మరో పేరు యాడ్ కానుంది. గురు సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ .. తేజ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలయింది. నేనే రాజు నేనే మంత్రి మూవీ తర్వాత తేజ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఆట నాదే వేట నాదే అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనుష్క, కాజల్ పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ తార అదితిరావు ఫిక్స్ అయినట్లు తెలిసింది. గతంలో మణిరత్నం తీసిన చెలియా సినిమాతో వెలుగులోకి వచ్చిన అదితి… ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. వెంకీ మూవీ ఓకే అయితే అదితి రావుకు ఇది రెండో తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఓ కీలక రోల్లో డాక్టర్ రాజశేఖర్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రానా, నాగ చైతన్య లు గెస్ట్ రోల్ చేస్తారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ విషయాలపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మొత్త 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనీ తేజ పక్క ప్లాన్ తో రంగంలోకి దిగారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus