Hidimbha: హీరో మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టినా.. లాభాలు వచ్చేశాయట..!

  • July 19, 2023 / 09:14 PM IST

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ‘జీనియస్’ ‘జత కలిసే’ ‘రాజు గారి గది’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ ‘రాజు గారి గది 2’ ‘రాజు గారి గది 3’ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను నటించిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. కానీ అతనికంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది లేదు. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘హిడింబ’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ బాగుంది. ఆ ఒక్క ట్రైలర్ తో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రమిది. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. జూలై 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ‘హిడింబ’ చిత్రానికి నిర్మాతలు అశ్విన్ మార్కెట్ కి మించి ఖర్చు పెట్టారట. అయినప్పటికీ ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్ కి వచ్చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. (Hidimbha) ‘హిడింబ’ చిత్రానికి రూ.9.5 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట. ప్రమోషన్, పబ్లిసిటీ కాస్ట్ లు అంతటితో కలిపి ఇంత బడ్జెట్ అయినట్టు వినికిడి. అయితే ముందుగానే నిర్మాతలు సేఫ్ అయిపోయారు. టేబుల్ ప్రాఫిట్స్ లో ఉంది సినిమా అని తెలుస్తుంది. పెద్దగా మార్కెట్ లేని హీరో పై ఇంత బడ్జెట్ పెట్టడం అంటే రిస్కే! అయినా కంటెంట్ ను నమ్మి నిర్మాతలు అశ్విన్ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus