ఫైట్ సీక్వెన్స్ కి అంత బడ్జెట్ ఏంటీ స్వామీ

  • March 1, 2018 / 09:35 AM IST

‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకపూర్ కథానాయికగా నటిస్తుండగా.. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీల్ నితిన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం హైద్రాబాద్, ముంబైలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈనెలాఖరుకు దుబాయ్ వెళ్లాలనుకొంది.

అయితే.. శ్రీదేవి మరణం కారణంగా ప్రస్తుతం దుబాయ్ లో చోటు చేసుకొని ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మార్చికి సదరు షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకొంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్-నీల్ నితిన్ ల కాంబినేషన్ లో భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే యువీ క్రియేషన్స్ దాదాపు 40 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారట. 40 కోట్లంటే.. మీడియం బడ్జెట్ సినిమాలు రెండు, చిన్న సినిమాలు ఒక అయిదారు తీయవచ్చు. దుబాయ్ లోని బుర్జ్ కలీఫా టవర్ తోపాటు సాండ్ స్ట్రోమ్ ఫార్మాట్ ఫైట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ సినిమాకి చాలా కీలకమట, అలాగే హైలైట్ గా నిలుస్తుందట. 2019లో విడుదలకానున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus