మరోసారి చిరుతో నయన్ రొమాన్స్ : అలాంటివి నమ్మకండి అంటున్న ఆమని : ప్రభాస్ తల్లిగా హేమమాలిని

  • February 1, 2021 / 08:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ చిత్రం చిరు సరసన ఏ హీరోయిన్ నటిస్తుంది అనే అంశంపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి ఒరిజినల్ లో హీరోయిన్ ఉండదు. అయితే తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్టు.. ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో పలు మార్పులు చెయ్యబోతున్నారట. కాబట్టి ఈ చిత్రంలో హీరోయిన్ ఉంటుంది. అందుకు గాను నయన తారని సంప్రదిస్తున్నట్టు సమాచారం.

సీనియర్ హీరోయిన్ ఆమని ఆరోగ్యం గురించి గత రెండు, మూడు రోజులుగా రకరకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏకంగా ఈమెకు గుండెపోటు వచ్చిందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమని తెలియజేసారు. మంచిర్యాలలో షూటింగ్లో పాల్గొంటూ ఉండగా… ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కొద్దిపాటి అస్వస్థతకు గురయ్యారు తప్ప.. ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారట. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆది పురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆమె తల్లి కౌశల్య పాత్రలో అలనాటి గ్లామర్ క్వీన్ హేమమాలిని కనిపించనుందట. ఈ విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus