ఆసక్తిని పెంచుతోన్న ‘అల వైకుంఠపురములో’ లేటెస్ట్ అప్డేట్..!

Advertisement

2019 లో అల్లు అర్జున్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. 2018 లో వచ్చిన ‘నా పేరు సూర్య’ ప్లాప్ అవ్వడంతో కొంచెం గ్యాప్ తీసుకుని .. త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు.

ఇక ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆయన పాత్రను దర్శకుడు త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేసాడట. అందుతోన్న సమాచారం ప్రకారం .. సముద్రఖని ఈ చిత్రంలో కామెడీ విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. బన్నీకి .. ఈయనకి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తాయట. ఇక టబు, రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, జయరామ్ పాత్రలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతారని… బన్నీ – త్రివిక్రమ్ లకు పెద్ద హిట్ పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus