ఆ రూమర్ ని మహేష్ ఫ్యాన్స్ ఏమి ఎంజాయ్ చేస్తున్నారో

  • February 23, 2020 / 10:03 PM IST

మహేష్ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. భరత్ అనే నేను, మహర్షి లతో పాటు సరిలేరు నీకెవ్వరు హిట్ కావడంతో ఆయన హ్యాట్రిక్ పూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ ఫోర్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. ఇక మహేష్ తన 27వ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. మే నుండి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మహర్షి మూవీ రావడం జరిగింది.

కాగా నేడు ఈ చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే మహేష్-వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయిందట. మహేష్ బాబు వంశీ పైడిపల్లి నెరేట్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ తో సంతృప్తి పడలేదట. అందుకే ఆయన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పారట. దానితో అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు లేవట. ఐతే ఈ విషయంలో ఎంత వరకు నిజముందో ఎవరికీ తెలియదు. కానీ మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలని వారు కోరుకుంటున్నారు. వంశీ తెరకెక్కించిన మహర్షి మూవీతో అంత సంతృప్తి చెందని మహేష్ ఫ్యాన్స్ అలా జరిగితే చాలా మంచిది అని కోరుకుంటున్నారు. మహేష్ రీపీటెడ్ గా అదే దర్శకులతో చేయడం వారికి నచ్చడం లేదు. టాలెంట్ ఉన్న సందీప్ వంగ, అట్లీ లేదా ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పాన్ ఇండియా మూవీ చేయాలని వారు కోరుకుంటున్నారు. మహేష్ మాత్రం ఎప్పుడూ తన చుట్టూ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. నేటి గాసిప్ మహేష్ ఫ్యాన్స్ అసహనాన్ని భయటపెట్టింది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus