అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహం తయారీకి భారీ వ్యయం

  • October 17, 2016 / 02:20 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  “మేడం టుస్సాడ్” బ్యాంకాక్ మ్యూజియంలో కలకాలం నిలిచి పోయే అర్హత పొంది తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటారు. టాలీవుడ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న సాధించిన తొలి హీరో గా డార్లింగ్ రికార్డ్ సృష్టించారు. ఇందుకోసం మేడం టుస్సాడ్ ప్రతినిధులు  హైదరాబాద్ కి వచ్చి అమరేంద్ర బాహుబలి ఫోటోలను, ప్రభాస్ శరీరపు కొలతలను తీసుకున్న సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితం ఈ విగ్రహం తయారీ పనులను మొదలు పెట్టారు. ఈ విగ్రహం తయారీకి సంస్థ వారు కోటిన్నర రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కొంచెం కూడా తేడా కనిపించకుండా అమరేంద్ర బాహుబలిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉండేలా విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ విగ్రహాన్ని వచ్చేఏడాది మార్చిలో ఆవిష్కరిస్తారు. అప్పటినుంచి సందర్శకులు మైనపు ప్రభాస్ తో కలిసి ఫోటోలు తీసుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus