బాహుబలి విగ్రహానికి అభిమానుల తాకిడి !

  • June 8, 2017 / 06:44 AM IST

ఒక సినిమా టాలీవుడ్ రికార్డులను మడత పెట్టి తన జేబులో వేసుకుంది. ఒక సినిమా ప్రపంచాన్ని మొత్తం మన టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. ఒక సినిమా మన టాలీవుడ్ స్థాయిని దశదిశలా వ్యాపింపజేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్ధం అయిపోయి ఉండాలి కదా. అవును నేను మాట్లాడేది సాక్షాత్తూ మన బాహుబలి గురించి, ప్రపంచంలో రిలీజ్ అయిన ప్రతీ చోట కలెక్షన్స్ వర్షం కురిపించిన బాహుబలి ఇప్పుడు మరో సంచలనానికి బీజం వేసింది. అసలు ఇప్ప్టికీ బాహుబలి మ్యానియాతో షేక్ అవుతున్న ఎరీయాస్ ఉన్నాయి అంటే నమ్మక తప్పని నిజం. ఇదే క్రమంలో మన ప్రభాస్ అభిమానులకు మరొక షాకింగ్ న్యూస్ విపరీతమైన జోష్ ను కలిగిస్తోంది.  అసలు విషయం ఏమిటి అంటే దాదాపుగా ఐదేళ్ల కెరీర్ ను పణంగా పెట్టి బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ చేసినందుకు ప్రభాస్ కు  వచ్చిన అంతర్జాతీయ స్థాయి క్రేజ్ ఇప్పుడు బ్యాంకాక్ ను కూడా షేక్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎలా అంటారా అయితే ఒకసారి ఈ కధ చదవండి మీకే తెలుస్తుంది…అసలు విషయంలోకి వెళితే… ప్రముఖుల మైనపు విగ్రహాల్ని తయారు చేసి లండన్.. బ్యాంకాక్.. హాంకాంగ్..  సింగపూర్ లలోని తమ మ్యూజియంలలో ఏర్పాటు చేసే టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు దాదాపు కోటిన్నర వరకూ ఖర్చుతో ప్రభాస్ బాహుబలి విగ్రహాన్ని రూపొందించి బ్యాంకాక్ లోని తమ మ్యూజియంలో ఏర్పాటు చేసారు. ఇక ప్రభాస్ విగ్రహాన్ని పెట్టిన తరువాత దీనిని చూసేందుకు బ్యాంకాక్ వెళ్ళిన వారంతా ఎగబడుతున్నారట. ఇంకా చెప్పాలి అంటే ఈ విగ్రహం పెట్టిన సమయం నుంచి ఈ మ్యూజియం టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది అని టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ తన స్నేహితులతో తన మైనపు బొమ్మ చూసుకోవడానికి త్వరలో బ్యాంకాక్ వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా యావత్ ప్రపంచాన్నే షేక్ చేసిన ప్రభాస్ మ్యానియా ఇప్పుడు బ్యాంకాక్ ని కూడా తాకింది అన్న మాట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus