ఆ మృతదేహం వెనుక అసలు కారణం ఏమిటంటే..!

  • September 19, 2019 / 01:48 PM IST

ప్రస్తుతం ‘కింగ్’ నాగార్జున ‘బిగ్ బాస్ సీజన్ 3’ హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా… తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన పొలంలో ఓ గుర్తుతెలియని మృతదేహం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం పాపిరెడ్డి గూడలో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో కుల్లిపోయిన మృతదేహం బయటపడింది. ఈ డెడ్ బాడీ కుళ్ళిపోయి ఉంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులకు తెలియజేసారు.

అసలు విషయం ఏమిటంటే.. 40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా.. సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట నాగార్జున. దీని పై కొందరు నిపుణులను అక్కడకు పంపారు నాగార్జున. ఈ క్రమంలో… పొలంలోకి వెళ్ళిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్ళిపోయిన మృతదేహాన్ని వారు గుర్తించి…. పోలీసులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా ఆ శవం దొరికిన గదిని కూడా సీజ్ చేశారు. ఇక చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఆ వ్యక్తిమరణం వెనుక కారణాలేమిటి? అనే విషయాల పై దర్యాప్తు చేపట్టారు. మరి ఈ విషయం పై నాగార్జున ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus