సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆది కి కూడా కరోనా అంటున్నారే..!

  • October 22, 2020 / 07:25 PM IST

బుల్లితెర పై ప్రేక్షకులు మిస్ కాకుండా చూసే షోలలో ‘జబర్దస్త్’ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పొరపాటున వాళ్ళు ఏదో ఒక ఎపిసోడ్ ను మిస్ అయినా కానీ.. హైపర్ ఆది స్కిట్ ను మాత్రం యూట్యూబ్లో మిస్ కాకుండా చూస్తుంటారు. ఇదిలా ఉండగా.. నాన్ స్టాప్ పంచ్ లతో ఆది ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. చాలా మంది హీరోలు కూడా ఆది స్కిట్ లకు పెద్ద ఫ్యాన్స్ అనడంలో అతిశయోక్తి కాదు.

రజినీకాంత్ వంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నటించిన ‘దర్బార్’ సినిమా తెలుగు వెర్షన్లో కూడా హైపర్ ఆది స్కిట్ గురించి ప్రస్తావన వచ్చిందంటే.. ఇతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా హైపర్ ఆది కరోనా భారిన పడినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సుడిగాలి సుధీర్ అని చాలా మంది అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సుధీర్ అందరితోనూ కలిసి మెలిసి ఉంటాడు.

ఇటీవల ఆయన కరోనా భారిన పడటంతో అతనితో సన్నిహితంగా ఉన్న వారంతా టెస్టులు చేయించుకున్నారట. అయితే ఒక్క హైపర్ ఆది, జానీ మాస్టర్లకు తప్ప అందరికీ నెగిటివ్ వచ్చిందని టాక్ నడుస్తుంది. ఈ ప్రచారంతో ఆది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో.. ఆయన స్పందించి క్లారిటీ ఇస్తేనే కానీ చెప్పలేము.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus