అమర్ అక్బర్ ఆంటోనీ పరాజయంతో ఇలియానా ముంబైకి జంప్

  • November 21, 2018 / 01:00 AM IST

“దేవుడు చేసిన మనుషులు” అనంతరం దాదాపు ఆరేళ్ళ విరామం తీసుకొని తెలుగులో “అమర్ అక్బర్ ఆంటోనీ”తో కమ్ బ్యాక్ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. “అమర్ అక్బర్ ఆంటోనీ”తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి బంపర్ స్టార్ట్ దొరుకుతుందని భావించిన ఇలియానాకి చుక్కెదురైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడమే కాక ఇలియానాకి కనీస స్థాయి గుర్తింపు కూడా లభీంచలేదు. పైగా.. సినిమాలో ఇలియానా మరీ బొద్దుగా కనిపించిందని, అసలు డ్యాన్సులు చేయలేకపోయిందని కామెంట్స్ వినిపించడంతో ఆమెను ఇమ్మీడియట్ గా సినిమాలోకి తీసుకొనేందుకు వేరే దర్శకనిర్మాతలెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

దాంతో బోలెడన్ని ఆశలు పెట్టుకొన్న తన పుట్టింటి లాంటి టాలీవుడ్ ను మళ్ళీ వదిలేయడం తప్ప మరో దారి కనిపించడం లేదట. ఆ దశలో ఇలియానాకు బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ రూపొందిస్తున్న ‘పాగల్ పంటి’ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. మరి ఇలియానా ఇదివరకట్లా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటుందా లేక తన కాంటాక్ట్స్ ను వాడి తెలుగులోనూ మరో ఆఫర్ దక్కించుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus