‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో ‘8 వసంతాలు’ (8 Vasantalu) అనే సినిమా వచ్చింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు మాత్రం ఈ సినిమా కొంచెం వార్తల్లో నిలిచింది. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేయడం.. ‘మధురం’ షార్ట్ ఫిలింతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకుడు కావడంతో ‘8 వసంతాలు’ పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్సీస్ లో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అక్కడ టాక్ తేడా కొట్టేసింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేశారు. ఇక్కడ కూడా సేమ్ రెస్పాన్స్. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించినా.. సెకండాఫ్ ఆసక్తి కరంగా లేకపోవడంతో టార్గెటెడ్ ఆడియన్స్ పెదవి విరిచారు. అందువల్ల రిలీజ్ రోజున టికెట్లు తెగలేదు. మరోపక్క ‘కుబేర’ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉండటం వల్ల ‘8 వసంతాలు’ (8 Vasantalu) షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి.
అయినప్పటికీ నామ మాత్రంగా సక్సెస్ మీట్ పెట్టారు. దీనికి నిర్మాతలు, దర్శకుడు హాజరు కాలేదు. పెద్ద బ్యానర్ లో వచ్చిన సినిమా కాబట్టి.. మీడియా వారు కూడా ఈ ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా వచ్చారు. కానీ వారికి కావాల్సిన ఫుటేజీ ఇక్కడ లభించలేదు. ఇక ‘8 వసంతాలు’ (8 Vasantalu) ప్లాప్ అయ్యిందని వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయ్యింది.
మరోపక్క ఈ సినిమాని రూ.6 కోట్ల బడ్జెట్లో తీసారట. దీనికి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.8 కోట్ల వరకు రికవరీ జరిగింది. సో నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ తోనే సినిమా రిలీజ్ చేశారు. కానీ థియేట్రికల్ గా సక్సెస్ దొరికితే కనుక డైరెక్టర్ కి కూడా ప్లస్ అయ్యేది. నెట్ ఫ్లిక్స్ లో దీనికి మంచి ఆదరణ లభిస్తుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు కాబట్టి.. అది వర్కౌట్ అవుతుందేమో చూద్దాం.