సూపర్ స్టార్ కొత్త సినిమాపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను అధికారులు

  • December 2, 2016 / 07:28 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఆదాయపు పన్ను అధికారులు దూకుడు పెంచారు. ఆదాయము ఎక్కువగా ఉన్న రంగాలపై నిఘా పెట్టారు. సినీ పరిశ్రమపై కూడా ఓ కన్ను వేశారు. కొన్ని రోజుల క్రితం బాహుబలి నిర్మాతలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. భారీ కలెక్షన్లను సాధించిన చిత్రం గా వార్తల్లో కెక్కడం, 200 కోట్లతో రెండో భాగం తెరకెక్కు తుండడంతో రైడ్ చేశారు. నిర్మాతల వద్ద పన్ను కట్టని నగదు 60 లక్షలు లభించినట్లు సమాచారం. ఇప్పుడు వారి దృష్టి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై పడిందంట.

వందకోట్లతో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతున్న ఈ మూవీ అధికారులను ఆకర్షించడానికి ఓ ప్రధాన కారణముంది. తమిళ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిల్మ్ శాటిలైట్ హక్కులు భారీగా అమ్ముడు పోవడమే చర్చకు తెరలేపింది. ఇతర ఛానళ్లతో పోటీ పడి తెలుగు, తమిళ శాటిలైట్ హక్కులను 26 కోట్లకు జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులే ఇంత ధర పలికితే థియేటర్ హక్కులు ఎంత మేర ఉంటుందో? వాటికీ సక్రమంగా పన్నులు కడుతున్నారా? లేదా? అనే కోణంలో సీక్రెట్ గా ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus