గాసిప్ రాయుళ్లకు కౌంటర్ ఇచ్చిన దిశా పటాని

  • July 2, 2018 / 11:08 AM IST

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పేరు కొంతకాలంగా వార్తల్లో బాగా నిలిచింది. తోటి నటుడు టైగర్‌ ష్రాఫ్‌ ని ప్రేమించి, రహస్యంగా పెళ్లిచేసుకున్నట్లు జాతీయ మీడియాలు కథనాలను ప్రచురించాయి. దీనిపై అం అప్పుడు ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు స్పందించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా తెలుగువారికి దిశా పరిచయమైంది. ఈ సినిమా విజయం సాధించకపోవడంతో ఆమె టాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని సినిమాలో చేసింది. సినిమా విజయం సాధించింది. హాలీవుడ్ లోను మూవీ చేసి మంచి నటిగా పేరుతెచ్చుకుంది. రీసెంట్ గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు చెప్పింది. ‘లోఫర్‌’ తరువాత తెలుగులో సినిమాలు చేయకపోవడడానికి కారణం? ఏమిటని ప్రశ్నించగా… “తెలుగులో నామొదటి సినిమా అది.

ఆ సినిమా ఫలితం నాకు నిరాశను మిగిల్చిన మాట వాస్తవమే. మరో సినిమా చేద్దామనుకునేలోపు బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగులో చేసే అవకాశం రాలేదు. త్వరలోనే ఓ తెలుగు సినిమా చేసే అవకాశముంది.” అని వెల్లడించింది. మీకు పెళ్లి చేసుకున్నారా? అని అడగగా.. నవ్వుతూ ఇలా స్పందించింది. ” టైగర్‌ ష్రాఫ్‌ నేనూ ప్రేమించుకున్నామని, కొన్నిరోజులు సహజీవనం చేశామన్నారు. పెళ్లికూడా చేసుకున్నట్టు వార్తలు సృష్టించారు. సినిమా పరంగా తనతో కొంత చనువుగా ఉండాల్సి వచ్చింది. అలాగే కలిసి ప్రమోషన్లలో పాల్గొనాల్సి వచ్చింది. అంత మాత్రాన ప్రేమా, దోమా అంటేఎలా? అలా అనుకుంటే నేను చేసిన ప్రతి హీరోతోనూ డేటింగ్‌ చేయాల్సి వస్తుంది. అది సాధ్యమేనా?” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus