Jagapathi Babu: ఆ సంఘటన నాకు గుణపాఠం… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

  • February 13, 2023 / 08:16 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు ఆ తర్వాత కొంతకాలం సినిమాలలో సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ విలన్ గా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తెలుగు తమిళ్ భాషలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇలా తన సినీ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్న జగపతిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యకు వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు. “నేను ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతుంది.

నాకు సినిమా తప్ప మరి ఏమీ తెలియదు. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ సినిమా షూటింగ్ సమయంలో దాదాపు వారం రోజులపాటు నాకు అన్నం కూడా పెట్టలేదు. కనీసం తింటారా? అని కూడా ఎవరు అడగలేదు. అప్పుడు నా పరిస్థితి చూసి లైట్ బాయ్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నం పెట్టకపోయినా ఎలాగో ఇక్కడే ఉంటాడు సినిమా చేస్తాడులే అని నన్ను చాలా చులకనగా చూశారు.

ఇతర భాషలలో సినిమాలు చేసి ఇక్కడికి వస్తే చాలా మర్యాద ఇస్తారు కానీ ఇక్కడే పుట్టి పెరిగిన వారికి మాత్రం మర్యాద ఉండదు. నా జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానం అదే. అవమానం నాకు జీవిత పాఠం నేర్పింది అంటూ తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం జగపతిబాబు తెలుగు తమిళ్ భాషలలో విలన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus