అత్యధిక తెరలపై రిలీజ్ కానున్న జై లవకుశ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ తో నట విశ్వరూపం చూపించిన జై లవకుశ క్రేజ్ కి తగినట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రైట్స్ 83.5 కోట్లకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నైజాం రైట్స్ 18  కోట్లకు సొంతం చేసుకున్నారు. కొన్న మొత్తానికి తగినట్లు కలెక్షన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లపై ఈ సినిమాని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే వంద తెరలను జై లవకుశ కోసం లాక్ చేసినట్లు తెలిసింది.

ఒక్క జిల్లాలోనే ఇన్ని స్క్రీన్స్ పై షో వేస్తుంటే .. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తెరలపై రిలీజ్ కానుందో అర్ధమవుతోంది. ఇంత గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ లో రికార్డ్ నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రాశీఖన్నా, నివేదా థామస్, నందితరాజ్, హంసానందిని, తమన్నాలు తమ అందం, అభినయంతో ఆకట్టుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus