సెన్సార్ పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్

  • August 26, 2016 / 01:22 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రికార్డులను తిరగ రాయడానికి సిద్దమయిపోయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి అన్ని పనులు పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఈ రోజు (శుక్రవారం) సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లింది. రెండు గంటల 40 నిమిషాల నిడివి గల జనతా గ్యారేజ్ ను వీక్షించిన సెన్సార్ సభ్యులు కట్స్ ఏమి చెప్పకుండా యు/ఏ సర్టిఫికెట్ ని అందించారు. సినిమాలో తారక్, మోహన్ లాల్ పోటీ పడి నటించారని, విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశాలు, ఫైట్ హైలైట్ గా నిలువ నుందని సమాచారం.

ఈ సినిమాతో ఎన్టీఆర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్ ల నటనతో పాటు కాజల్ ప్రత్యేక గీతం సినిమాకు ప్లస్ అయ్యాయని, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలతోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోశారని సెన్సార్ సభ్యుల టాక్. జనతా గ్యారేజ్ తెలుగు, తమిళ భాషలో ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus