12న జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్..!!

  • August 2, 2016 / 10:34 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న సినిమా జనతా గ్యారేజ్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఈనెల 12 న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. వేదికను కూడా ఖరారు చేశారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో జనతా గ్యారేజ్ పాటలను విడుదల చేయనున్నారు. ఆ కార్యక్రమాన్నిఅయోధ్య మీడియా వారు ఆర్గనైజింగ్ చేయనున్నారు.  ఓ పాట చిత్రీకరణ కోసం కేరళ వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులు మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి తిరిగి వస్తారు.

ఆడియో వేడుకను పూర్తి చేసిన వెంటనే కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. అక్కడ వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చేనెల 2 వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని కొరటాల శివ శ్రమిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ పోన్ చేసిన ఈ  మూవీని మరో సారి వాయిదా వేయడానికి సిద్ధంగా లేరు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తారక్ తో సమంత, నిత్యామీనన్ రొమాన్స్ చేయనున్నారు. వీరితో పాటు కాజల్ స్పెషల్ సాంగ్ చేయనుంది. ముగ్గురు భామలతో ఎన్టీఆర్ కనువిందు చేయనున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన పాటల ప్రవాహం వినాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus