సౌందర్యతో పెళ్లి.. అప్పుడే అయిపోయేది

  • February 27, 2021 / 02:35 PM IST

రామ్ గోపాల్ వర్మకు ఒకప్పుడు అత్యంత సన్నిహిత వ్యక్తులతో జేడీ చక్రవర్తి ఒకరు. ఇప్పటికి కూడా వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. శివ సినిమా నుంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిన జేడీ పలు సినిమాలతో అప్పట్లో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. సత్య సినిమా అప్పట్లో జేడీ స్థాయిని ఆకాశానికి పెంచేసింది. ఇక ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో మెరుస్తున్న జేడీ ఈ సారి ఎమ్ఎమ్ఓఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇటీవల సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటుడు ఎవరు ఉహీంచని విషయాన్ని చెప్పాడు. ఒకప్పుడు సౌందర్యతో విషయం పెళ్లి వరకు వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చారు. దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి, కెమెరామెన్ శరత్ మరియు లిరిసిస్ట్ చంద్రబోస్ వైఫ్ సుచిత్ర.. ఇలా అందరు కలిసి సౌందర్యతో పెళ్లి చేయాలని అనుకున్నారట. అయితే జెడి చేసుకోలేనని డైరెక్ట్ గా చెప్పేశాడట. అప్పుడు ఒప్పుకొని ఉంటే పెళ్లి జరిగి ఉండేదని అన్నాడు.

ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రేమకు వెళయరా! షూటింగ్ సమయంలోనే సౌందర్యతో గొడవ జరిగిందని జెడి వివరణ ఇచ్చారు. దాని వల్ల కొన్నాళ్ళు సౌందర్యతో దూరం కూడా పెరిగిందని, కలిసినా కూడా మాటలు మాట్లాడుకోలేదని చెప్పాడు. ఇక కొంత కాలం తరువాత ఇద్దరం ఆ విషయాన్ని మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ అయినట్లు చెప్పారు. ఇక సౌందర్య తన జీవితంలో ఎలాగైనా ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని చాలా ఆశపడింది. కానీ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయినట్లు జేడీ చక్రవర్తి వివరణ ఇచ్చారు.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus