Jeevitha Rajasekhar: వాళ్లది తప్పని నిరూపిస్తా.. జీవిత సవాల్!

  • October 9, 2021 / 05:05 PM IST

‘మా’ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ ఒకరిపై మరొకరు గెలవడానికి ఎత్తుకుపైఎత్తులు వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరినొకరు నిందించుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ తనదైన స్టైల్ లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాల అవసరం లేదన్నారు. లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముందని జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు.

‘మా’ సభ్యుల్లో సుమారు 920 మంది ఉంటారని చెప్పారు. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయాలంటే భయపడుతున్నారని జీవిత చెప్పారు. ‘అమ్మా.. మీకు ఓటు వేయగలమా..? వచ్చి ఓట్లు గుద్దించుకువెళ్తారేమో’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జీవిత ఆరోపించారు. ఈ క్రమంలో రాజీవ్ కనకాల, శివ బాలాజీలపై విమర్శలు చేశారు. వాళ్లిద్దరంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ వాళ్లు నిజాలు మాట్లాడడం లేదని అన్నారు. వాళ్లు మాట్లాడిన ప్రతీ మాటా తప్పని నిరూపిస్తానంటూ జీవిత సవాల్ విసిరారు.

వాళ్లది తప్పని నిరూపితమైతే తమకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఒకవేళ తాను తప్పు మాట్లాడానని ఎవరైనా అనుకుంటే నడి రోడ్డుపై చెప్పుతో కొట్టండంటూ ఘాటుగా స్పందించారు. జీవిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus