Jr NTR: ఎమ్మార్వో ఆఫీస్ లో తారక్.. ఏమైందంటే?

  • July 31, 2021 / 08:40 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగష్టు నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ సినిమా పనులతో తారక్ బిజీ కానున్నారు. త్వరలో షూటింగ్ నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లబోతున్న ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి దగ్గర ఉన్న తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపాలపురం గ్రామంలోని ఆరున్నర ఎకరాల భూమిని ఎన్టీఆర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఎన్టీఆర్ కార్యాలయానికి వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది తారక్ తో ఫోటోలు దిగగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బిజీ అవుతున్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ కానున్నట్టు జెమిని టీవీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

ఎన్టీఆర్, చరణ్ తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బుల్లితెరపై ఎన్టీఆర్ ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ తన ప్రతిభతో మెప్పించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. తొలి ఎపిసోడ్ కు చరణ్ గెస్ట్ గా హాజరు కానుండగా మరి కొందరు సెలబ్రిటీలు కూడా ఈ షోకు హాజరయ్యే జాబితాలో ఉన్నారు.

1

 

2

3

4

5

 

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus