జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్

  • July 29, 2016 / 01:29 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న సినిమా జనతా గ్యారేజ్. ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ టీమ్ త్వరలో కేరళకు వెళ్లనుంది. ఆగస్టు 1 నుంచి  అక్కడి లొకేషన్లలో ఓ పాటను చిత్రీకరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నఈ చిత్రంలో తారక్ తో సమంత, నిత్యామీనన్ రొమాన్స్ చేయనున్నారు. ఈ అందాల తారల జాబితాలోకి మరో పేరు తాజాగా చేరింది.

జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాల్లో కలిసి నటించిన కాజల్ జనతా గ్యారేజ్ లో తళుక్కున మెరవనున్నట్లు సమాచారం. ఓ పాటలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ వార్త తెలిసి తారక్ అభిమానులు ఆనంద పడుతున్నారు. వారి జోడి బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ఫిలిం కి కాజల్ మరో ప్రత్యేకత కానుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని హీరో, దర్శకుడు భావిస్తుండడంతో ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదు. భారీ ఫైట్ల తో పాటు, పాటలను కనుల విందుగా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందుకే హాడావుడిగా చిత్రాన్ని కంప్లీట్ చేయకుండా… రిలీజ్ ని వాయిదా వేశారు. ముందుగా చిత్రాన్ని ఆగస్టు 12 న విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు సెప్టెంబర్ 2 కి పోస్ట్ పోన్ చేశారు. కేరళలోని పాటతో పాటు, మరో పాట, కొన్ని యాక్షన్ సీన్లను విదేశాల్లో షూట్ చేస్తే ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవుతుంది. శ్రద్దగా పనిచేసి సెప్టెంబర్ 2 న జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేందుకు చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus