చిరు, చరణ్ లతో కాజల్ ప్లాన్!

  • December 5, 2020 / 02:48 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం ఇటీవల తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి అలానే మరికొందరి నటుల మీద భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ. త్వరలోనే ఇక్కడ షెడ్యూల్ ని పూర్తి చేసి కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు.

అందులో హీరోయిన్ కాజల్ పాల్గొనుందని సమాచారం. ఇటీవలే కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. మాల్దీవులకు హనీమూన్ కి వెళ్లింది. ప్రస్తుతం తన హనీమూన్ యాత్రను ముగించుకొని తిరిగి సినిమాలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో ఇటీవల చెన్నైకి వెళ్లి దర్శకుడు డీకే రూపొందించనున్న హారర్ సినిమాలో నటించడానికి అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. ఇక వచ్చే నెల నుండి రాజస్థాన్ లో జరగనున్న ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా జాయిన్ కానుంది.

ప్రస్తుతం చిరంజీవి నీహారిక పెళ్లి కోసం ఉదయ్ పూర్ వెళ్లారు. ఆ వేడుకలు పూర్తయిన తరువాత హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్ లో పాల్గొంటాడు. అది పూర్తయిన తరువాత జనవరిలో రాజస్థాన్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తోన్న రామ్ చరణ్ కూడా రాజస్థాన్ షెడ్యూల్ లో పాల్గొనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus