ఆసక్తికి రేపుతున్న కాజల్ లేటెస్ట్ మూవీ ప్రకటన

  • October 5, 2020 / 07:49 PM IST

చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ బ్రేక్ లేకుండా సాగుతుంది. సౌత్ ఇండియాలో ఆమె వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తుంది. కాజల్ చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి త్రిషా తప్పుకోగా, కాజల్ అవకాశం దక్కించుకుంది. అలాగే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు మూవీలో కూడా ఆమె హీరోయిన్ కావడం విశేషం.

ఇక మంచు విష్ణుతో పాటు ఇండో అమెరికన్ మూవీ మోసగాళ్లులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు హిందీ హిట్ మూవీ క్వీన్ రీమేక్ తో పాటు ఓ హిందీ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. కాజల్ తో పాటు కెరీర్ ప్రారంభించిన అనేక మంది హీరోయిన్స్ ఫేడవుట్ అయిపోయగా కాజల్ మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ లో కాజల్ బోల్డ్ రోల్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ్ లో కాజల్ మరో ఆఫర్ ఒకే చేశారు.

హీరో శింబు సరసన కాజల్ నటించనున్నారు. శింబు తండ్రి రాజేందర్ ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించనుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus