అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!

  • November 10, 2020 / 01:54 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాను కామెంట్ చెయ్యాలి అనుకుంటే… అవతలి వ్యక్తి ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తి అయినా సరే.. వెనక్కి తగ్గదు. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్… అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదట జో బైడెన్ ను ఓ గజినీతో పోల్చింది. ‘అతనికి ప్రతీ ఐదు నిమిషాలకు డేటా క్రాష్ అయిపోతుంది. ఇక అతను వాడుతున్న మందుల వల్ల ఏడాదికి మించి ఉంటాడన్న గ్యారెంటీ లేదు’ అంటూ కంగనా కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ‘జో బైడెన్ తరువాత మొత్తం షోని నడిపించేది కమల హ్యారిసే’ అని చెప్పుకొచ్చింది. ఓ మహిళ ఎదిగితే కనుక… ఇతర మహిళలకు కూడా మార్గాన్ని చూపిస్తుంది’ అంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమల గురించి చెప్పుకొచ్చింది.

ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ… ‘నేను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు… కానీ, చివరి మహిళను మాత్రం కాను’ అంటూ ధీమా వ్యక్తం చేసింది. కమల కామెంట్స్ కు కంగనా కూడా మద్దతుపలకడం విశేషం.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus