నిర్మాతకి కోపం వచ్చినా లెక్క చెయ్యలేదట…!

  • April 3, 2020 / 07:32 PM IST

కంగనా రనౌత్ … ఈమెను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అని అంతా అంటుంటారు. ‘నిత్యం వార్తల్లో నిలుస్తుంది… వివాదాలు పెట్టుకుంటుంది’ అని చాలా మంది కామెంట్స్ చెందుతుంటారు. దర్శకుడు క్రిష్ తో అలాగే సోనూ సూద్ తో ఈమె గొడవ పెట్టుకుంది అని అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈమె పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విషయం పక్కన పెడితే… మరికొంత మంది మాత్రం ‘కంగనా … ముక్కు సూటి మనిషి.. తనకి మనసులో అనిపించింది చెప్పేస్తుంది. నచ్చక పోతే మోహం మీదే చెప్పేస్తుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వదు’ అని చెబుతుంటారు. ఈ విషయం పై కంగనా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ..”నిజమే నేను నాకు నచ్చింది మాత్రమే చేస్తాను. సినిమాల పరంగా కూడా నాకు ఇష్టమైన పాత్రలనే అంగీకరిస్తాను. స్టార్ హీరోల సరసన హీరోయిన్ అవకాశం వచ్చినా… పాత్ర పరంగా ప్రాధాన్యత లేకపోతే నేను ఒప్పుకోను.

సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రంలో అనుష్క శర్మ చేసిన పాత్ర కోసం ముందుగా నన్నే అడిగారు. కానీ కొన్ని కారణాల వల్ల చేయనని చెప్పేసాను. అందుకు ఆ నిర్మాతకి కోపం వచ్చినా నేను లెక్క చేయలేదు. ఇక రణబీర్ కపూర్ జోడీగా ‘సంజూ’ చిత్రంలో కూడా సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ పాత్ర కూడా నా స్థాయికి తగింది కాదని చేయలేదు. రణ బీర్ స్వయంగా కాల్ చేసినా నో అని చెప్పేసాను” అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus