Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

భారీ తారాగణంతో, అంతకుమించిన బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ (Prabhas) నుంచి మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) దాకా పెద్ద పెద్ద స్టార్లు నటిస్తుండటంతో సినిమాపై ఆడియన్స్ ఫోకస్ ఉంది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh).. ఇప్పటివరకు పెద్దగా కనిపించింది లేదు.

Kannappa

మొత్తానికి అతన్ని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కి పట్టుకొచ్చారు. సినిమా ప్రకటన దగ్గర నుండి, పోస్టర్లు, టీజర్లు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు ఎక్కువగా కనిపించింది లేదు. కనీసం మంచు విష్ణు కానీ మోహన్ బాబు (Mohan Babu) కానీ ఇతని పేరు ప్రస్తావించకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందేమో అని ఆడియన్స్ అనుమానపడ్డారు. ఓ దశలో ‘అసలు ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు బ్రో?’ అనే డిస్కషన్లు కూడా సోషల్ మీడియాలో తెగ జరిగాయి.

అయితే ఈరోజు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ‘కన్నప్ప’ (Kannappa) ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముకేశ్ కుమార్ సింగ్ దర్శనమిచ్చాడు. ఆయన ప్రెజెన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ‘కన్నప్ప’ (Kannappa) కి ముందు ముకేశ్ కుమార్ సింగ్ ‘మహాభారత్’ సీరియల్‌ ని డైరెక్ట్ చేశారు. చాలా మందికి ఈ విషయం తెలీదు.

ఇక ఆయన స్పీచ్ ఇస్తూ.. ‘తనకు భాషపై అవగాహన లేకపోయినా ‘కన్నప్ప’ (Kannappa) వంటి పెద్ద ప్రాజెక్టుని దర్శకత్వం వహించే బాధ్యత తనకి అప్పగించినందుకు మోహన్ బాబు (Mohan Babu), విష్ణు (Vishnu Manchu)..లకు థాంక్స్’ అంటూ తెలిపారు. అలాగే ప్రభాస్ (Prabhas) అభిమానులకు రెబల్ స్టార్ అయితే తనకు మాత్రం ‘హంబుల్ స్టార్’ లా అనిపిస్తారని కూడా ముకేశ్ కుమార్ సింగ్ చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేయించారు.

మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus