ప్రభాస్ పక్కన నటించనున్న బాలీవుడ్ బ్యూటీ

  • May 13, 2017 / 10:20 AM IST

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ ని సెలక్ట్ చేయడం కస్టమయిపోతోంది.కన్నడ బ్యూటీ రష్మిక మందనా హీరోయిన్ గా తీసుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ కి బాలీవుడ్ లోను క్రేజ్ ఉండడంతో అక్కడి బ్యూటీ అయితే బాగుంటుందని డైరక్టర్ డిసైడ్ అయ్యారు. అందుకే  బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రా ని సంప్రదించారు. కానీ వారి డేట్స్ ఖాళీలేదు.

దీంతో సుజీత్ కత్రినా కైఫ్ ని అడగడంతో ఆమె ప్రభాస్ పక్కన నటించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది.  మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాల ద్వారా కత్రినా తెలుగు వారికి పరిచయమే. అందువల్ల ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోను ఇబ్బంది ఉందని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ప్రభాస్ సేదతీరుతున్నారు. అతను ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ కి రాగానే షూటింగ్ పనులు మొదలు అవుతాయి. అప్పుడే హీరోయిన్ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus