స్పష్టం చేసిన మహానటి కీర్తి సురేష్

  • September 19, 2018 / 07:14 AM IST

కీర్తి సురేష్ సినిమా కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు మహానటికి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అభినేత్రి సావిత్రిలా నటించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత అనేక ఆఫర్లు ఆమె ముందు వాలాయి. కానీ ఆమె కథల ఎంచుకోవడంలో ఇప్పుడు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మహానటి సినిమాకి ముందు ఒప్పుకున్నా సినిమాలను కంప్లీట్ చేసింది. తమిళంలో విశాల్ సరసన “పందెంకోడి 2 ” చిత్రంలో నటించగా , చియాన్ విక్రమ్ తో ‘సామి’ అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో సామి ఈ నెల 21న విడుదలకానుండగా, పందెంకోడి 2 అక్టోబర్18న విడుదలకానుంది.

ఇక ఇప్పుడు ఆమె తమిళ నటుడు శశి కుమార్ నటిస్తున్న “కొంబు వేచ సింగం” అనే చిత్రంలో నటిస్తుందని గత కొద్దీ రోజులగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కీర్తి కొట్టిపడేశారు. ప్రస్తుతం తాను “కొంబు వేచ సింగం” సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఏ సినిమాకి ఒకే చెప్పలేదని వెల్లడించారు. ఆమె మాటలను బట్టి చూస్తుంటే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మ్యాసివ్ మల్టీ స్టారర్ సినిమాలో అవకాశం అందుకున్నట్టు ఉంది. జక్కన్న సినిమా కోసం అన్ని ఆఫర్లను పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. అసలు నిజమేంటో త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus