మహేష్ బాబు తో నటించడం మంచి అనుభవం : కైరా అద్వానీ

  • February 5, 2018 / 07:48 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో  చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీకి దగ్గర్లో జరుగుతోంది. అక్కడ క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తున్నారు.  డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై  డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మహేష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు తో నటించడం ఒక అద్భుతమైన అనుభవం.

ఆయన ఒక టీం ప్లేయర్ లాంటి వ్యక్తి. ఆయన టీం లోని అందరిపై జోక్స్ వేస్తూ నవ్విస్తుంటారు. సెట్ లో మహేష్ ఉన్నంత సేపు యూనిట్ మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఉంటుంది” అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా మాట్లాడుతూ ..” ఎంత సీరియస్ గా షూటింగ్ జరుగుతున్నా, మహేష్ నవ్వులతో సమయం గడిచినట్లే తెలియదు. ఇంకా మహేష్ ప్రతి షాట్ ని మోనిటర్లో చూస్తారు. బాగా వచ్చేవరకు రీ టేక్ చేస్తారు.” అని కైరా వివరించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus