పారితోషికం ఇవ్వలేదనే వార్తలపై స్పందించిన కైరా అద్వానీ!

  • July 17, 2018 / 12:11 PM IST

చిత్ర పరిశ్రమలో గాసిప్ లకు కొదవ ఉండదు. ఎవరు సృష్టిస్తారో.. తెలియదు గానీ అందరూ నమ్మేలా ఉంటాయి. ఆ వార్తల్లో ఉన్న వ్యక్తులకు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అదే విధంగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ షాక్ తింది. ఎందుకు షాక్ కి గురయిందంటే…  కొర‌టాల శివ దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు నటించిన “భ‌ర‌త్ అనే నేను” సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా భారీ క‌లెక్ష‌న్లు సాధించిన‌ప్ప‌టికీ సినిమా కోసం ప‌నిచేసిన కొంద‌రికి నిర్మాత డీవీవీ దాన‌య్య రెమ్యున‌రేష‌న్ చెల్లించలేద‌ని వార్త రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, హీరోయిన్ కైరాకి దాన‌య్య రెమ్యున‌రేష‌న్ పూర్తిగా చెల్లించ‌లేద‌ని ఆ వార్తలో ఉంది.

దీంతో దాన‌య్య ట్విట‌ర్ ద్వారా ఓ ప్రెస్ నోట్ విడుద‌ల చేసి ఆ వార్త‌ల‌ను ఖండించారు. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కూడా ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని స్పష్టం చేశారు. సినిమా విడుద‌ల‌కు ముందే దాన‌య్య త‌న‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేశార‌ని వెల్ల‌డించారు. తాజాగా కైరా అద్వానీ స్పందించింది. “దాన‌య్యగారి గురించి వ‌చ్చిన వార్త‌లు చూసి షాక‌య్యా. ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండే ఆ నిర్మాణ సంస్థ‌లో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నా. అతనితో విభేదాలేమైనా ఉంటే.. వెంట‌నే ఆయ‌న నిర్మించే మ‌రో సినిమాను ఎందుకు అంగీక‌రిస్తాను. దాన‌య్య‌గారు నిర్మించే త‌ర్వాతి సినిమాలో కూడా న‌టించాల‌ని కోరుకుంటున్నాను” అని కైరా తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus