బోయపాటి శ్రీను కథను కొట్టేశాడా ?

  • September 6, 2016 / 01:07 PM IST

ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం అందరూ డైరక్టర్ బోయపాటి శ్రీను గురించే మాట్లాడుకుంటున్నారు. భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు వంటి హిట్ చిత్రాలు తీసిన ఈ దర్శకుడి ప్రతిభను అనుమానిస్తున్నారు. టేకింగ్ లో ప్రత్యేక శైలి ఉన్నా కథ, మాటలు రాయడంలో వీక్ అని చెప్పుకుంటున్నారు. రచయితగా అనేక సినిమాలకు పనిచేసి, దర్శకుడిగా మారి హ్యాట్రిక్ అందుకున్న కొరటాల శివ ఆరోపణలతో బోయపాటి ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శివ మాట్లాడుతూ “నేను అనేక సినిమాలకు కథ, మాటలు రాసాను. కొన్ని సినిమాల్లో నాకు క్రెడిట్ ఇవ్వలేదు. అప్పుడు చాలా బాధ వేసేది. సింహ విషయంలోనూ అదే జరిగింది. ఆ చిత్రానికి కథ, మాటలు నేనే రాసాను. కానీ ఎదో ఒకటే ఎంచుకోమని బోయపాటి అడగగా బాధతో ఏమి వద్దని  చెప్పాను” అని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ కసితోనే డైరక్టర్ అయ్యానని వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీలో దుమారం రేగింది. టాలీవుడ్ లో రచయితలకు విలువ దక్కడం లేదనే ఆరోపణలకు కొరటాల శివ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి.   బోయపాటి అతనిపై వచ్చిన ఆరోపణలకు ఏవిధంగా స్పందిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus