రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య తరువాత కోటా, బాబు మోహన్ లే ఆ లోటు తీర్చారట..!

  • December 4, 2020 / 12:17 PM IST

టాలీవుడ్ చిత్రాల్లో విలన్ పక్కన ఓ కమెడియన్ ఉండి కామెడీ పండించడం అనేది పాత సినిమాల నుండీ చూస్తూనే వస్తున్నాం.ఇలాంటి ట్రాక్స్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య. మొదట వీళ్ళే ఆ ట్రెండ్ కు పునాది వేసింది. ఆ తరువాత దానికి కొనసాగుతూ వచ్చింది మాత్రం కోట శ్రీనివాసరావు,బాబు మోహన్ అనే చెప్పాలి. వీళ్ళ కామెడీ ట్రాక్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ బుల్లితెర పై వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తూనే వస్తున్నారు.

వీరి కాంబినేషన్లో 60కి పైనే సినిమాలు వచ్చాయి. ఓ పక్క కోటా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తుంటే పక్కన బాబు మోహన్ కామెడీ పండించేవాడు. దీంతో ఆరోజుల్లోనే ఆడియెన్స్ రిపీటెడ్ గా థియేటర్లకు వచ్చేవారు అనడంలో అతిశయోక్తిలేదు. అయితే ఇటీవల వీళ్లిద్దరూ కలిసి ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో పాల్గొన్నారు.వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ‘బొబ్బలి రాజా’ అని తెలిపారు. వెంకటేష్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

కోటా, బాబు మోహన్ ల కామెడీ ట్రాక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు తరువాత ‘మామ గారు’ చిత్రంలో కూడా వీరి కామెడీ ట్రాక్ అద్భుతంగా పండింది.దాంతో ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో వీళ్ళు ఎక్కువ ఛాన్స్ లు దక్కించుకున్నారని చెప్పొచ్చు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus