మల్టీస్టారర్ చిత్రాన్ని తీసే ఆలోచనలో కృష్ణవంశీ

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కి పదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది. 2007లో వచ్చిన చందమామ సినిమా తర్వాత విజయాన్ని అందుకోలేకపోయారు. చేసిన చిత్రాలు కూడా తక్కువే. శశిరేఖ పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే.. అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన నక్షత్రం.. కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇందులో సందీప్ కిషన్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తనీష్ లను నటింపజేయించాడు. అయినా విజయం వరించలేదు. పైగా చేతికొచ్చిన బాలకృష్ణ రైతు ప్రాజెక్ట్ చెయ్యి జారిపోయింది. దీంతో మరింత కసితో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే కథని సిద్ధం చేసిన కృష్ణవంశీ.. హీరోలను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. టాలీవుడ్ లో చాలామంది కృష్ణవంశీ అంటే వెనకడుగు వేస్తున్నారు. అందుకే మాధవన్‌ను ఒక హీరో గా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మిగతా వారిని ఒప్పించే పనిలో ఉన్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనుకున్నట్టుగా అంత సజావుగా జరిగితే వచ్చే ఫిబ్రవరిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నటు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి ఇప్పుడైనా హిట్ కొడతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus