కృష్ణ వంశీ దర్సకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం ప్రారంభం

  • April 27, 2016 / 09:21 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. యువ కథానాయకుడు “సందీప్ కిషన్” హీరోగా రూపొందుతున్న ఈ “నక్షత్రం” చిత్రం ఈ రోజు ఉదయం ‘9.27’ నిమిషాలకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆత్మీయ అతిధుల సమక్షంలో వైభవంగా జరిగింది.

“పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ “నక్షత్రం” అని తెలిపారు దర్శకుడు కృష్ణ వంశీ. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus