‘ఉప్పెన’ ను ఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే కృతి శెట్టిని తీసుకున్నారట..!

  • February 12, 2021 / 01:18 PM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఒక్క పాట ‘ఉప్పెన’ సినిమా పై ఫోకస్ పడేలా చేసింది. అయితే ఈ చిత్రం పై అంచనాలు మరింత ఏర్పడడానికి హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ అనే చెప్పాలి. సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసినప్పటి నుండీ.. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి.

చాలా మందికి ఈమె క్రష్ గా కూడా మారిపోయింది అంటే అతిశయోక్తి లేదు. అయితే ‘ఉప్పెన’ చిత్రంలో మొదట హీరోయిన్ గా కృతిశెట్టిని అనుకోలేదట. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. ఆ అవకాశం ఈమెకు దక్కిందట. వివరాల్లోకి వెళితే.. ‘ఉప్పెన’ చిత్రంలో హీరోయిన్ గా మొదట మనీషా రాజ్ ను అనుకున్నారట. ఈమె సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఎన్.శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అందుకే ఈమెకు తరువాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. చేతి వరకూ వచ్చిన ‘ఉప్పెన’ చిత్రాన్ని కూడా మిస్ చేసుకుంది.

నిజంగా ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి. దానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఏమైతేనేం కృతి శెట్టికి మంచి ఛాన్సే దక్కిందని చెప్పొచ్చు. ‘ఉప్పెన’ చిత్రం కారణంగా కృతి శెట్టికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో కూడా ఈమె ఛాన్స్ కొట్టేసింది. ఇంకా మరిన్ని అవకాశాలు ఈమె తలుపుతడుతున్నాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus