సైమా వేడుకకు హోస్ట్ గా మంచు లక్ష్మీ

  • June 30, 2016 / 11:45 AM IST

టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలందరూ ఒకే చోట సందడి చేయనున్నారు. సింగపూర్ లోని సెంటెక్ కన్వేషన్ సెంటర్ లో నేడు, రేపు (జూన్ 30, జులై 1) జరగనున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)2016 కార్యక్రమానికి దక్షిణ భారత దేశానికి చెందిన దాదాపు వందమంది సినీ ప్రముఖుకులు హాజరుకానున్నారు.

ఎంతో వైభవంగా నిర్వహించనున్న అవార్డు ప్రదానోత్సవానికి నిర్మాత, నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్నిలక్ష్మీ సోషల్ మీడియాలో వెల్లడించారు. “ఈ ఏడాది నేను సైమా వేడుకకు హోస్ట్ గా వెళుతున్నాను. నన్ను ఆశీర్వదించండి” అంటూ పోస్ట్ చేశారు. అంతే కాదు సింగపూర్లో ల్యాండ్ అయినా వెంటనే తెలుగు నటులు, టెక్నీషియన్ లతో కలిసి ఒక సెల్ఫీ ని కూడా అప్ లోడ్ చేశారు.

ఈ చిత్రంలో రానా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, సుధీర్ బాబు, రకుల్ ప్రీతి సింగ్, ప్రగ్యా జైస్వాల్, తదితరులు ఉన్నారు. ఈ వేదికపై గతేడాది విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 19 విభాగాల్లో అవార్డులను అందించనున్నారు. సైమా ఉత్సవంలో భాగంగా అనిరుద్ రవిచందర్,  హుమా ఖురేషి, ఉషా ఊతప్ప, ఐశ్వర్య రాజేష్, నీరజ్ మాధవ్, రెజీనా తదితరులు ప్రదర్శన ఇవ్వనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus