Pawan Kalyan: ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నాం.. పవన్ నిర్మాత కామెంట్స్!

  • May 29, 2021 / 01:50 PM IST

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఇటీవల విడుదలైన టీజర్ అనే చెప్పాలి. టీజర్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. పవన్ కెరీర్ లో ఇదొక సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ క్రమంలో ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మీడియాతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

తాజాగా సినిమా షూటింగ్, రిలీజ్ ల గురించి అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తయిందని.. చివరిగా చేసిన షెడ్యూల్ లో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు షూటింగ్ జరిపామని.. తరువాత పవన్ కరోనా బారిన పడటం, అలానే లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టలేకపోయామని రత్నం తెలిపారు. ప్రస్తుతం పవన్ సెట్లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారని.. కొత్త షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రామ్ పాల్ జాయిన్ అవుతారని చెప్పారు.

అర్జున్ రామ్ పాల్.. ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారని చెప్పారు. తనకు ఈ సినిమా గొప్పగా తీయాలనే ఆలోచన తప్ప బడ్జెట్ గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన ఇప్పటికీ ఉందని.. కానీ ఏం జరుగుతుందో చూడాలని రత్నం చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus