స్కిన్ షో గురించి.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్లు..!

  • December 21, 2019 / 12:18 PM IST

చాలాకాలం తర్వాత ‘అర్జున్ సురవరం’ చిత్రంతో ఓ హిట్ అందుకుంది లావణ్య త్రిపాఠి. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా కాలం నుండీ ఊరిస్తూ.. ఊరిస్తూ.. చివరికి నవంబర్ 29న విడుదలయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. కథకి ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టి.. లావణ్యకు గుర్తింపు దక్కింది. ఇక మొదటి నుండీ ఈమె మితిమీరిన స్కిన్ షో చేయలేదు. ఈ విషయం పై ఎప్పుడూ స్పందించని ఈ బ్యూటీ.. ఎట్టకేలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ” గతంతో పోల్చితే ఇప్పుడు హీరోయిన్స్ గ్లామర్ షో గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమాలో హీరోయిన్ లుక్ మరియు ఆమె నటన పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఇప్పుడు ఆధరణ పెరుగుతుండడం మంచి పరిణామం అనే చెప్పాలి. దీని వల్ల నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దొరుకుతాయి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె హాకీ ప్లేయర్ గా కనిపించబోతుందని తెలుస్తుంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus