అనుమతి లేకుండా ‘సాహో’ దర్శకనిర్మాతలు లేపేశారు..!

  • August 31, 2019 / 02:12 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా విడుదలైన ఈ చిత్రం దర్శక నిర్మాతల పై సినీ నటి లీసా రే మండిపడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ లో ‘సాహో’ దర్శక నిర్మాతల పై విమర్శలు గుప్పించింది. తన సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ ను వారి పోస్టర్లలోను, సినిమాల్లోని కాపీ కొట్టారని ఆరోపణలు వ్యక్తం చేసింది. దీనికి సంబందించిన ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ‘సాహో’ లోని ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను కూడా షేర్ చేసి చూపిస్తుంది.

ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ…. ‘ఇలాంటి వాటిపై మనం స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. కాపీ కొట్టడం అనేది కరెక్ట్ కాదన్న విషయం సినిమా మేకర్స్ కు కనీసం తెలుసుండాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటి విటీని దొంగతనం చేయడమే. ఇలాంటివి ఏ మాత్రం అంగీకరించేవి మాత్రం కావు. కనీసం షిలోను సంప్రదించలేదు కూడా. ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు.మీ ఇంట్లోకి చొరబడి మీకు సంబందించిన అత్యంత విలువైన వస్తువును దొంగిలిస్తే… మీకు ఎలా ఉంటుంది?” ‘ అంటూ ఓ రేంజ్లో మండిపడుతుంది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus