మహేష్ నిర్ణయాన్ని మార్చిన మా వివాదం

  • September 7, 2018 / 10:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు.. మనసున్న వ్యక్తి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. ఎవరూ సాయం కోసం వచ్చినా.. ఎప్పుడూ కాదనలేదు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సొంత బిల్డింగ్ కట్టుకోవాలి.. అందుకు నిధులు సేకరణలో భాగంగా అమెరికాలో ఈవెంట్ నిర్వహిస్తున్నామని చెప్పగానే .. తనవంతు సాయంగా “మా” నిర్వహించే ఈవెంట్ కి వస్తానని మహేష్ మాట ఇచ్చారు. తాజాగా “మా”లో చెలరేగిన వివాదం కారణంగా నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. వివాదంలోకి వెళితే.. ‘మా’కి సొంత భవనం కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా ‘మా’కి కోటి రూపాయల నిధులు సమకూరింది.

ఈ కోటి రూపాయలు కాకుండా అదనంగా కొంత డబ్బు అసోసియేషన్‌కు చెందిన బినామీ అకౌంట్‌లోకి చేరినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంతో “మా” రెండుగా చీలిపోయింది. ఈ వివాదానికి ముందే అక్టోబర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈవెంట్ ఫిక్స్ చేశారు ‘మా’ సభ్యులు. మహేష్ ఈ ఈవెంట్ చేస్తే ‘మా’ భారీ మొత్తంలో నిధులు వస్తాయి. కానీ ‘మా’ వివాదం చెలరేగిన నేపథ్యంలో మహేష్ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలిసింది. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ ఈ సమయంలో తాను ఈ షో చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ వెనక్కి వెళ్లిపోవడంతో ఈవెంట్ జరిపిస్తారా? లేదా వాయిదా వేస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus