పార్టీ చేసుకున్న మహానటి చిత్ర బృందం.!

  • March 23, 2018 / 11:24 AM IST

ఆరంభం ఉత్సాహాన్నిస్తుంది.. ముగింపు నిరుత్సాహాన్ని ఇస్తుంది. కానీ సినిమా మేకింగ్ విషయంలో ప్రారంభం ఉత్సాహాన్నిస్తే.. ముగింపు దుఃఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అదెలా అంటే అప్పటి వరకు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉన్న నటీ నటులు, టెక్నీషియన్లు విడిపోతున్నందుకు బాధ కలుగుతుంది. ఆనందం ఎందుకంటే ప్రాజక్ట్ డైరక్ట్ ఆలోచనకు అనుగుణంగా వచ్చినందుకు. ఈ రెండు అనుభవాలను మహానటి చిత్ర బృందం అందుకుంది. సావిత్రి బయోపిక్ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో సావిత్రి చిత్రపటానికి నివాళి అర్పించారు.వీడిపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేడు పార్టీ చేసుకున్నారు.

ఈ వేడుకలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, దర్శకుడు నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, హాలీవుడ్‌ కెమెరామెన్‌ డాని సాంషెజ్‌లోపేజ్‌  తదితరులు పాల్గొని డ్యాన్సులతో అలరించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్లు అందుకుంటున్నాయి.  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, అతని కుమార్తె స్వప్న దత్ కలిసి వైజయంతి మూవీస్‌, ‘స్వప్న సినిమా’ బ్యానర్లపై  నిర్మిస్తున్న ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. మే 9వ తేదీన మహానటి  తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయ్యేలా కష్టపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus